
భద్రాచలం, వెలుగు : భారీ వర్షాల కారణంగా గోదావరిలో పాపికొండల టూర్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వర్షాలతో వాగులు, వంకలు పొంగడంతో పాటు గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సీలేరు, శబరి నదుల నుంచి కూనవరం వద్ద గోదావరిలోకి నీళ్లు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టూరిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాపికొండల టూర్ను నిలిపివేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అప్రమత్తంతా ఉండాలని సూచించారు. కలెక్టరేట్, భద్రాచలం ఆర్డీవో ఆఫీస్ లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. వాగులు దాటొద్దని, నదుల వద్ద సెల్ఫీలు దిగొద్దని సూచించారు.